హేయమైన చర్యకు పాల్పడిన పిజ్జా డెలివరీ బాయ్కు టర్కీ న్యాయస్థానం 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కస్టమర్ ఆర్డర్ చేసిన పిజ్జాను డెలివరీ చేయడానికి వెళ్లిన బాయ్.. వినియోగదారుడికి ఇచ్చే ముందు దానిలో ఉమ్మి ఇచ్చాడు. డెలివరీ బాయ్కు సంబంధించిన ఈ హేయమైన చర్య ఆ అపార్ట్మెంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్ యజమాని సెక్యూరిటీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం బయటపడింది. దాంతో యజమాని వెంటనే బాధితుడికి ఆ ఫుటేజీని చూపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వీడియోలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ చర్యకు పాల్పడిన సదరు డెలివరీ బాయ్ను బురక్గా గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బురక్కు రూ.48వేల జరిమానా కూడా విధించారు. ఈ ఘటన 2017లో టర్కీలోని ఎస్కిసేహీర్ అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా ఈ కేసు టర్కీ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన డెలివరీ బాయ్కు కోర్టు 18 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
Video Source: GoneViral