telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

అభ్యర్థి తరపున రూ.15 కోట్లు పంపకాలు.. పోలీసుల అదుపులో యువకుడు

MLA Upender Reddy Join shortly TRS
హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటివరకు 15 కోట్ల రూపాయల వరకూ ఓట్ల కోసం పంపకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ మేరకు సందీప్ నుండి కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. 
సందీప్ రెడ్డి కోడ్ పద్దతిలో రాసుకొన్న కాగితాలను పోలీసులు  స్వాధీనం చేసుకొన్నారు. ఈ కాగితాలపై సందీప్ రెడ్డి రాసుకొన్న అంశాలను పోలీసులు డీ కోడ్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి నుండి రూ. 10 లక్షల నగదు తో పాటు మూడు ల్యాప్‌టాప్‌లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  చేవేళ్ల  కాంగ్రెస్ అభ్యర్ధి విశ్వేశ్వర్ రెడ్డికి సందీప్ రెడ్డి సమీప బంధువుగా చెబుతున్నారు.

Related posts