telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు: విజయసాయి రెడ్డి

Vijayasai reddy ycp

పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మతం మార్చటానికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నారని వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.

‘కిరసనాయిలు మాటలు, రాతలు చూస్తుంటే ఆయనకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్టు లేదు. చంద్రబాబు నాయుడి పతనంతోనే అక్రమార్జన నిలిచి పోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్ కంట్రోల్ తప్పినట్టుంది. ఇంగ్లిష్ మీడియం మతం మార్చటానికట.. అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Related posts