telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ డీకే అరుణ ఫైర్

dk aruna bjp

మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని… ప్రచారం చేయడం తప్ప కార్మికులకు చేసింది శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో భూదాన్ పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట్ లో ఎంతో మంది చేనేతే కార్మికులు ఉంటే పట్టించుకోవడం లేదని ఫైర్‌ అయ్యారు. షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ శిలా ఫలకం వేయడం తప్ప ఒక అడుగు కూడా ముందు పడటం లేదని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సిల్క్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కాదు… బ్రతుకు తెలంగాణ కోసం ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని… తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించేందుకు నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Related posts