టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారా దాదాపు ఏడేళ్ల తర్వాత పుజారా ఐపీఎల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే తాజాగా పుజారా మాట్లాడుతూ… మనం టీమిండియా జట్టుకు ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నా. కానీ ఇప్పుడు హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు’ అని అన్నాడు. 2018 తర్వాత హనుమ విహారిని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది’ అని చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డాడు. విహారి గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించాడు.
previous post
next post