పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్తో ముందుకు సాగింది. ఈ చిత్రం ఫుల్ రన్లో ఈ చిత్రం 37.50 కోట్లు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది. డియర్ కామ్రేడ్తో పాటు మరిన్ని సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు తగ్గలేదు. రామ్ కెరీర్లో తొలిసారి 75 కోట్ల మైలురాయి అందుకున్న సినిమా ఇదే. టెంపర్ తర్వాత సరైన విజయం లేక చూస్తున్న పూరీ జగన్నాథ్కు ఈ చిత్రం ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందించింది. ఈ చిత్ర తమిళ, హిందీ రీమేక్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కాగా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని తెలిసింది. ఈ చిత్రం కోసం నిర్మాణ వర్గాలు హీరో ధనుష్తో సంప్రదింపులు జరుపుతున్నారని, మాస్ ఫాలోయింగ్ వున్న ధనుష్ అయితేనే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. ఇప్పటికే తెలుగు చిత్రాన్ని చూసిన ధనుష్ రీమేక్లో నటించడానికి సుముఖంగా వున్నారని తెలుస్తోంది. ఇప్పటికే “మారి” చిత్రంలో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ధనుష్ కు ఈ సినిమాలోని పాత్ర బాగుంటుంది అంటున్నారు ఆయన అభిమానులు.