మా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. విష్ణు ప్యానెల్, ఇటు ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నారు.
ఈ క్రమంలో.. మా’ పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశ్రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
పోలింగ్ బూత్లో మోహన్బాబు ఆవేశంతో ఊగిపోయి… బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.. ఎన్నికల్లో అవకతవకలు జరిగతే చంపేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్బాబు..
మరోవైపు.. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.
‘మా’ ఎన్నికల్లో సినీ నటులు పవన్కల్యాణ్, మోహన్బాబు, పోసాని కృష్ణమురళి, సాయికుమార్, మంచు లక్ష్మీ, వడ్డే నవీన్ రామ్చరణ్ , సుమ, శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, రాఘవ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆ హీరోల గురించి సంచలన కామెంట్స్ చేసిన మంచు విష్ణు…