మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు, వర్షం వంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన ఎంఎస్ రాజు ఇప్పుడు రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగులు ఎంఎస్ రాజు రాయడం విశేషం. “డర్టీ హరి” అనే టైటిల్ని చిత్రానికి ఫిక్స్ చేయగా, మూవీ ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11.11ని.లకి విడుదల కానుంది. ఈ చిత్రం అందంగా మరియు కవితాత్మకంగా యువ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని ఎంఎస్ రాజు వెల్లడించారు. గూడూరి శివరామకృష్ణ, గూడురు సతీష్ బాబు, గూడురు సాయి పునీత్ సంయుక్తంగా ఎస్పీజే క్రియేషన్స్ బేనర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర హీరో హీరోయిన్స్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
నాగబాబు కామెంట్-3: కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి