telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భువనేశ్వరిపై వైసీపీ విమర్శలు.. మండిపడ్డ కనకమేడల

MP kanaka Medala comments elections

అమరావతిలో దీక్షలు చేపట్టిన రైతులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు తో ఆయన భార్య భువనేశ్వరి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు.

అవాస్తవాలను పదేపదే చెప్పి వాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని చెప్పారు. టీడీపీ నేతలెవరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని చెప్పారు. దొనకొండ వద్ద జరిగిన భూ లావాదేవీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts