మా ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ కి ఫిలింనగర్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీచేస్తున్నారు ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నారు. పదవుల మేరకు వివిధ రంగుల్లో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. మా ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు.
పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాశ్రాజ్ ప్యానళ్లతో పాటు మోహన్బాబు తదితరులు అక్కడికి చేరుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రకాశ్రాజ్, మోహన్బాబు కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్.. మోహన్బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్బాబు.. విష్ణుతో ప్రకాశ్రాజ్కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్రాజ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
కాగా..’మా’లో మొత్తం 925మంది సభ్యులు ఉండగా, 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా ‘మా’ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ను నిర్వహిస్త్తున్నారు. ‘మా’ ఎన్నికలకు 50మంది పోలీసులతో బందో బస్తు నిర్వహిస్తున్నారు. మొదట ఈసీ మెంబర్ల ఫలితాలు, చివరికి ‘మా’ అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రి 8గంటల తర్వాత ‘మా’ అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా