telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా

Kangana

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే పేరును ప్రస్తావించకుండా బేబీ పెంగ్విన్‌ అంటూ కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పీఓకే వ్యాఖ్యలతో కంగన- శివసేనల మధ్య తలెత్తిన మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. శివసేన ఎంపీ, ముఖ్యనేత సంజయ్‌ రౌత్‌ విమర్శలకు స్పందించిన కంగన.. భారీ భద్రత నడుమ ముంబైలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బీఎంసీ అధికారులు పాలిలోని ఆమె ఆఫీసులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూల్చివేత ప్రారంభించారు. దీంతో కంగన కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. కంగన సోమవారం ముంబైని వీడి స్వస్థలం మనాలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈ మేరకు “ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు ఆదిత్య ఠాక్రేకు వినోదం పంచే మూవీ మాఫియా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హంతకులు, డ్రగ్స్‌ రాకెట్‌ గురించి నేను బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న అసలైన సమస్య, నేను చేసిన అదిపెద్ద నేరం ఇదే. అందుకే వాళ్లు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, సరే చూద్దాం.. ఎవరు ఎవరిపై పగ తీర్చుకుంటారో!!!” అని కంగన ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు.

Related posts