దివంగత అందాల తార శ్రీదేవి , బోనీ కపూర్ ల ముద్దులకుమార్తె ఖుషీ కపూర్ నవంబర్ 5న తన 21వ పుట్టినరోజును జరుపుకుంది. ఆమె సోదరి జాన్వీ కపూర్ ఖుషీ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన చిన్నారి చెల్లెలుకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ఫోటోలను షేర్ చేసింది.”HBD మై లడ్డూ బేబీఅంటూ రాసింది. ఈ పార్టీకి సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి, అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్, భూమి పెడ్నేకర్ తదితరులు హాజరయ్యారు.
ఈ ఫోటోల లో, జాన్వి అందమైన పింక్ మినీ డ్రెస్లో కుర్రకారుని ఆకట్టుకునేలా దుస్తులు ధరించినట్లు చూడవచ్చు, ఖుషీ పాస్టెల్ కలర్ గౌనుని దరించింది. అలాగే ఇద్దరూ ఎప్పటిలాగే అందంగా కనిపించారు. జాన్వి తన చెల్లెలుతో పాటు అక్కడ ఉన్న వారితో సంతోషంగా హాట్ పోజులిచ్చింది.
ఆధారాలతో సహా కౌశల్ మీడియా సమావేశం