కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కేసుకు సంబంధించి సిద్దిపేట కోర్టుకు శనివారం రేవంత్రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీలో హరీష్రావుకు ఇక కాలం చెల్లినట్లేనని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్రెడ్డి అన్నారు. నమ్మినవాళ్లను నట్టేటముంచడం కేసీఆర్కు అలవాటేనన్నారు.
హరీశ్కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ ఇవ్వరని తెలిపారు. 16మంది ఎంపీలుంటే పార్లమెంట్ లోఏదో వెలగబెడతామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా..? విభజన హామీలు సాధించారా? అని రేవంత్ ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీగానే కొనసాగుతాయని రేవంత్ పేర్కొన్నారు.
డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది..