దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో ఇప్పుడు కరోనా కేసులు 20 లక్షల మార్కును దాటాయి. మోదీ ప్రభుత్వం మాయమైపోయిందని ఆయన విమర్శించారు. కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటిన సందర్భంగా జులై 17న రాహుల్ చేసిన ట్వీట్ను ఆయన ఈ రోజు రీట్వీట్ చేశారు.
‘దేశంలో కరోనా 10 లక్షల మార్కును దాటింది. దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఆగస్టు 10లోపు దేశంలో 20 లక్షల మందికి పైగా కరోనా సోకుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తప్పకుండా ప్రణాళికలు వేసుకుని, సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ అప్పట్లో పేర్కొన్నారు.