telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఉల్లి దిగుమతికి టెండర్లను ఆహ్వానించిన కేంద్రం

onions

దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుంది.

దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే పండగల సీజన్ కావడంతో ఉల్లి వాడకం అధికంగా పెరిగింది. ఈ నెలాఖరులో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Related posts