మొన్నటి వరకు భాక్తులతో కితకిట్లాడిన తిరుమల కొండలు చలి తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారి దర్శనం కోసం ఒక్క కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శ్రీవారి టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67288 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.