telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వెనక్కి తగ్గిన రాజేంద్ర ప్రసాద్ క్లైమాక్స్…

విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా చేస్తున్న సినిమా క్లైమాక్స్. రాజేంద్ర ప్రసాద్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. అతడు ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా అనడంతో ఈ సినిమా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృథ్వీరాజ్, శివ శంకర్ మాస్టర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని భవానీ శంకర్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా రాజేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ విుడదల అయింది. ఈ ట్రైలర్‌ ప్రాకారం చూస్తే.. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో రిచ్ అని అర్థం అవుతోంది. అయితే మొదట ఈ సినిమాను ఇదే నెల 27న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికంటే ఓ వారం వెళ్ళింది క్లైమాక్స్. మార్చి 5న క్లైమాక్స్ ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్రను చాలా డేంజరస్ వ్యాక్తిగా చిత్రించారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related posts