దుబ్బాక ఉప ఎన్నికలకు పోలీస్ అబ్జర్వర్ గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ ఠాకూర్ ఐపీఎస్ ను నియమించడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నదని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వారి కుటుంబ సభ్యులను కార్యకర్తలను దాడులతో వేధించడమే కాకుండా సోదాల నెపంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నదని మండిపడ్డారు. స్థానికంగా టిఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉండటంతో ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర నిఘా విభాగాల సూచనలు, ప్రజల ఒత్తిడి, భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి మేరకు పోలీస్ అబ్జర్వర్ గా సరోజ్ కుమార్ టాకూర్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక లో శాంతిభద్రతల పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఈ ప్రత్యేక అధికారిని నియమించిన తర్వాత శాంతియుతంగా నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు.
previous post