telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ ఫార్మా ప్రమాదంపై కన్నా దిగ్భ్రాంతి

Kanna laxminarayana

విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీజేపీ సంతాపం తెలియచేస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు.

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. బాధితులకు నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా నల్లని పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ ప్రమాద ఘటనలో తీవ్రగాయాలతో ఒకరు గుర్తు పట్టని స్థితిలో ఉన్నారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Related posts