*టీడీపీ కార్యకర్తలపై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తే..వారి తోకలు కట్ చేస్తాం..
*మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా..?మీరు ఆపితే మహానాడుఆగుతుందా..?
*గొండవీటి సింహాం గర్జిస్తాం తప్పా వెనకడుగు వేయం..
*భవిష్యత్లో చక్రవడ్డీతో సహా వసూలు చేస్తాం..
*టీడీపీని ఇబ్బంది పెడితే జగన్కి పైశాచికానందం..
మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో జరగనున్న మహానాడుకు మంగళగిరినుంచి బయల్దేరిన చంద్రబాబుకు మార్గ మధ్యలో చిలకలూరిపేట వద్ద టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..టీడీపీ కార్యకర్తలపై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. పార్టీ నేతలను వేదించి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. విచ్చి వేశాలు వేస్తే వారి తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పడు జరిగినా జగన్ ఇంటికి పోవడం ఖాయమని స్పష్టం చేశారు..
మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా… ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వనివ్వరా? ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారన్న చంద్రబాబు ..జగన్ ఒక చిల్లర సీఎం అని అన్నారు. అన్ని గుర్తు పెట్టుకుంటున్నామని… చక్ర వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత హెచ్చరించారు.
వైసీపీ ఆపితే మహానాడు ఆగుతుందా? అని ప్రశ్నించారు. ప్రభంజనంలా మహానాడు జరగబోతుందని తెలిపారు. మహానాడుకు నడిచైనా.. ఎడ్లబళ్లల్లోనైనా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమన్నారు. ఏ ఒక్క వర్గం బాగుందన్నా.. తిరిగి అమరావతికి వెళ్లిపోతానని ఆయన సవాల్ విసిరారు.
ఓడిపోయిన చోట పవన్ మొహం చూపించలేదు: అంబటి