telugu navyamedia
వార్తలు సామాజిక

1,40,640 పోస్టుల భర్తీకి రైల్వే గ్రీన్ సిగ్నల్..!

Train Indian railway

వివిధ కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ సంసిద్దమవుతోంది. 1,40,640 ఉద్యోగాల భర్తీ కోసం రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ ఈ శాఖ జారీ చేసింది. దీంతో 2.4 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. వీటి స్క్రూటినీ కూడా పూర్తయింది. అయితే, పరీక్షలు నిర్వహించే సమయానికి దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో పరీక్షల ప్రక్రియ ఆగిపోయింది.

ప్రభుత్వం ఇప్పుడు పలు సడలింపులు ఇవ్వడంతో డిసెంబరు 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. అభ్యర్ధులందరికీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు వివరించారు.

రైల్వే భర్తీ చేయనున్న పోస్టుల్లో నాన్ టెక్నికల్ పాప్యులారిటీ కేటగిరీ (ఎన్‌టీపీసీ) కింద గార్డులు, ఆఫీస్ క్లర్కులు, కమర్షియల్ క్లర్కుల ఉద్యోగాలు 35,208, మినిస్టీరియల్ కేటగిరీ కింద స్టెనో తదితర 1663 పోస్టులు, ట్రాక్ నిర్వహణ, పాయింట్‌మేన్ వంటి పోస్టులు 1,03,769 పోస్టులు ఉన్నాయి.

Related posts