తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషించి భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. అయితే చివరగా తెలుగులో మన్మథుడు 2 మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్పై ఫోకస్ పెట్టేసింది. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించాలని ప్లాన్ చేసి బోల్డ్ పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా రాబోతున్న కొత్త సినిమాలో రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఆ యువతి పాత్రలో రకుల్ కనిపించనుందట. బోల్డ్ రోల్ అయినప్పటికీ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో రకుల్ ఈ రోల్ పోషించేందుకు రెడీ అయిందని తెలుస్తోంది.
next post