పట్టభద్రుడు సునీల్ నాయక్ది ఆత్మహత్య కాదని… ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ చేతగానీతనంతో చేసిన హత్యేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురికి పదవులు ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోని యువతను మాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గత వారం కాకతీయ యూనివర్సిటీలో సునీల్ నాయక్ విషం తీసుకుని చికిత్స పొందుతూ నేడు గాంధీ ఆస్పత్రిలో మృతి చెందడం బాధకరమన్నారు. సునీల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. వారు కుటుంబం ధైర్యంగా ఉండాలని వారికి అండగా ఉంటామని వివరించారు. చనిపోయిన సునీల్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఆత్మహత్య కాదని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను వేధిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్యేనని మండిపడ్డారు. సునీల్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. యువత ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రాణంతో ఉండి అసమర్థ సర్కార్ను గద్దె దించేందకు నడుం బిగించాలని సూచించారు.
యువత ఆత్మహత్య చేసుకుంటున్న సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వెల్లడించారు. కమీషన్ సభ్యులను నియమించాలనే ధ్యాసలేని కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపడితే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకునే వారు కాదని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ మలిదశ పోరాటంలో 1200 మంది యువత ప్రాణాలు ఆర్పించారని.. వారి యువత త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ యువత ఆత్మహత్యలకు పాల్పడడం బాధకరమన్నారు. యువకులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడ వద్దని విజ్ఞప్తిచేశారు. అందరం కలిసి సర్కార్పై ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలు సాదిద్దాం కానీ ఇలా ఆత్మర్పారణలతో కాదన్నారు. ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే నేతలుగా మేము ముందుంటామని స్పష్టం చేశారు. అలాగే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులను నియమించి ఒకేదఫాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.