కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ముకేశ్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు.
యువజన కాంగ్రెస్లో ముఖ్య పాత్ర పోషించిన ముఖేష్ గౌడ్ 1986లో జాంబాగ్ నుంచి కార్పొరేటర్గా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2007లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి బీసీ శాఖా మంత్రిగా పనిచేశారు. 2009లో మార్కెటింగ్ శాఖ బాధ్యతలు చేపట్టి పూర్తికాలం పనిచేశారు. 2014, 2018లలో అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.