telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాసేప‌ట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటి..

*నేడు ప్రధానితో సీఎం జగన్‌ భేటీ
*రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతోనూ సమావేశం
*రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేప‌ట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జగన్‌.. ఇవాళ పీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు .

రాత్రి జన్‌పథ్‌-1లోని నివాసంలో బస చేసిన సీఎం.. ఉదయం 10:30 గంటలకు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదలపై భేటీలో చర్చకు రానుంది. పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని సీఎం జగన్ కోరనున్నారు. వివిభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, తదితర విషయాల గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Related posts