ప్రస్తుతం ఏపీలో ఆలయాల పై దాడులు వైరల్ గా మారాయి. అయితే జగన్ ఏ ప్రాంతానికి వెళ్తారని తెలిస్తే అక్కడ ప్రముఖ ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖపుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యదేవాలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్న ఆయన ఆలయాల పై దాడులను తీవ్రంగా ఖండించారు. సీఎం ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఒకటి రెండు రోజులు ముందుగానో , ఆ తర్వాత కానీ పథకం ప్రకారం ఆలయాల పై దాడులు చేయిస్తున్నారని ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితని మండి పడ్డారు. గతంలో ఘటనల నుంచి నేటి రామతీర్థం వరకూ ఇదో ఆనవాయితీగా పెట్టుకున్నారని…ఇలాంటి దౌర్జన్య ,దుష్టచర్యలను అందరూ ముక్తఖంఠంతో ఖండించాలని కోరారు. భగవంతుడు శిక్ష వేస్తున్నా కొందరికి ఇంకా జ్ఞానం రావడం లేదని భగవంతుడు అందరికీ భగవంతుడేనని గుర్తుంచుకోవాలని సూచించారు. భగవంతుడు పార్టీలకు , కులాలకు , మతాలకు అతీతుడని..కానీ కొందరు పదే పదే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు . రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్న పార్టీల ఆలోచనలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
previous post
next post