తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు.. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువులో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు
తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు.
ఇక, ఈ రోజు ఉదయం ధనిష్ఠానక్షత్ర సుముహూర్తాన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మీదుగా సపరివార రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగహోమం, అఘోర మంత్రహోమం, దీగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్ఘాటన పూర్తి కావడంతో.. నేటి నుంచి రామలింగేశ్వర స్వామి నిజదర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. .
పవన్ కల్యాణ్కు కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు ..