telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్ కు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్…

yogi adityanath

ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్నికలు కాకరేపుతున్నాయి… జాతీయ పార్టీలు తమ అగ్ర నేతలను రంగంలోకి దింపుతున్నాయి.. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ… గ్రేటర్‌లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది.. దీనిలో భాగంగా.. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి రప్పిస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలతో పాటు.. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కూడా వస్తున్నారు.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంటు, పాతబస్తీలో రోడ్ షో చేయనున్నట్లు చెబుతున్నారు. జీడిమెట్ల ఉషా ముళ్ళపూడి ఆసుపత్రి నుంచి 5 గంటల వరకు ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రోడ్ షో ఉండనుందని అంటున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి పాతబస్తీలోని శాలిబండ, లాల్ దర్వాజలో పబ్లిక్ మీటింగ్స్ లో యోగీ ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు. రాత్రి 8.30కు బేగంపేట నుంచి యోగి ఉత్తరప్రదేశ్ తిరుగు ప్రయాణం కానున్నారు. చూడాలి మరి ఈయన ఇక్కడ ప్రజలపైన ఎంత ప్రభావం చూపిస్తారు అనేది.

Related posts