సీపీఎస్ను కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో సీఎంవో లో ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లని.. వైసిపి ప్రభుత్వాన్ని నారా లోకేశ్ ప్రశ్నించారు.
శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ… యూటీఎఫ్ నేతలు, ఉద్యోగ సంఘం నాయకులు, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించడాన్ని లోకేశ్ ఖండించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దని… మాట తప్పి మడమ తిప్పిన జగన్… మోసపు రెడ్డి కాదా అని దుయ్యబట్టారు.
ఉపాధ్యాయుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండను తప్పుబట్టారు. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారన్న లోకేశ్… ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని టీడీపీ డిమాండ్!