telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని టీడీపీ డిమాండ్!

TDP Change Puthalapattu Candidate

వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతోనే రాజ్యసభ సభ్యత్వానికి అర్హత కోల్పోయారని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం లాభదాయక పదవి చేపడితే రాజ్యసభ సీటుకు అనర్హుడవుతాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద ఆయన రాజ్యసభ సభ్యత్వం వవదులుకోవాలని డిమాండ్ చేశారు. అనర్హత వేటు పడుతుందని తెలిసి జులై4న రాష్ట్ర ప్రభుత్వం జీవో రద్దు చేసిందని, ప్రభుత్వ చర్య రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ కిందకు రాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఆర్డినెన్స్‌ జారీచేసిన విషయం తెలిసిందే.

Related posts