టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటికే 18 కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకున్నాడని తెలిపారు. వ్యవస్థపై ఆయనకు నమ్మకం ఉంటే కోర్టుల నుంచి ఆయన తెచ్చుకున్న స్టేలను తొలగించుకుని నిజాయతీని నిరూపించుకోవాలన్నారు.
పలు కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకున్నాడు. వ్యవస్థపై నమ్మకం ఉంటే స్టేలు తొలగించుకుని సచ్ఛీలతను నిరూపించుకోవాలి. ఎఫ్ఐఆర్ను రిపోర్టు చేయొద్దనడం, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించడం, అమరావతి కుంభకోణం విషయంలో కోర్టుల తీరు ఆక్షేపణీయం’ అని ఆయన ట్వీట్ చేశారు.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్