telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దళితులపై దాడుల కేసుల్లో న్యాయం జరగడంలేదు: మాజీ ఎంపీ హర్షకుమార్

Harshakumar ex MP

దళితులపై జరిగిన దాడుల కేసుల్లో న్యాయం జరగడంలేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ దళితులపై ఉన్న ఒక్క కేసును కూడా ఎత్తివేయలేదని ఆరోపించారు.

చీరాల యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసు విచారణ సందర్భంగా తప్పని సరి పరిస్థితుల్లో తానే పిల్ వేయాల్సి వచ్చిందని వివరించారు. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు జైల్లో వేశారని ఆరోపించారు. రైలు దహనం ఘటనలో కాపులపై కేసులు ఎత్తివేశారన్నారు. రిలయన్స్ మాల్స్ పై దాడుల కేసులు, ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తివేశారని తెలిపారు.

Related posts