telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి : హీరో అర్జున్

Arjun

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతక్రియలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్‌హౌస్‌లో బాలు అంత్యక్రియలు ముగిశాయి. బాలు అంత్యక్రియలకి హాజరైన హీరో అర్జున్ బాలుకి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జున్ .. ఎస్పీ బాలుకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇండ‌స్ట్రీలు అన్ని క‌లసి రావాలని అన్నారు. 45 వేల పాట‌లు రెండు జ‌న్మలు ఎత్తిన పాడ‌లేరు అని అర్జున్ వెల్లడించారు. అటు అభిమానులు కూడా బాలు కూడా భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాగా తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు గానగందర్వుడు ఎస్పీ బాల‌సుబ్రహ్మణ్యం. 16 భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడిన ఒకే ఒక గొప్ప వ్యక్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. నటుడిగా సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు పేరుపొందాడు. సంగీత ప్రపంచంలో ఆయనని ఎవరూ అందుకోలేరు. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు సంపాదించారు

Related posts