పీటల మీద వధువు కారణంగా ఓ పెళ్లి ఆగిపోయింది. తాను ఓ యువకున్ని ప్రేమించానని.. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ వధువు 100కు డయల్ చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని రాజేశ్కు కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతికి పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించారు. ఈ మేరకు నిన్న ఉదయం 11:55 కి ముహుర్తం ఖరారు చేశారు. ముందుగా కళ్యాణ మండపంలో పెళ్లి పీటలపై వధువు కూర్చుంది. అంతలోనే ఆ వధువు లేచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పి… 100 నంబర్కు డయల్ చేసింది. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వధువును స్టేషన్కు తీసుకువచ్చి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ వధువు తాను ప్రేమించిన కాంపెల్లికి చెందిన యువకున్నే చేసుకుంటానని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా.. అదే కళ్యాణ మండపంలో తన బంధువులకు చెందిన మరో యువతితో వరుడు రాజేశ్ వివాహం జరిగింది. దీంతో చేసేది ఏమీ లేక… వచ్చిన బంధువులు ఆ జంటను ఆశీర్వదించారు.
previous post
next post