telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చిల్ల్ర‌న్స్‌ కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..

తిరుమల తిరుప‌తిలో సోమవారం నాడు సీఎం జగన్ పర్యటించారు.ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు.

CM YS Jagan Inaugurates Children Heart Care Unit At BIRRD Hospital - Sakshi

అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.

Related posts