telugu navyamedia
తెలంగాణ వార్తలు

మెద‌క్ జిల్లాలో విషాదం..

మెద‌క్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మనోహరబాద్ మండలం కాళ్ళకల్ వద్ద స్పీకర్ పోచారం కాన్వాయి వెళ్తుంది. కాన్వాయ్‌ వస్తున్న విషయాన్ని గమనించకుండా నర్సింహారెడ్డి(50) రోడ్డు దాటుతుండగా సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు.

Pocharam Srinivas Reddy elected speaker of Telangana legislative assembly - India News

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వలస వచ్చి కాళ్ళకల్ గ్రామంలో నివాసముంటున్న నర్సింహారెడ్డి పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప‌రిశ్ర‌మ ముందు రోడ్డు దాటుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Related posts