దేశం మొత్తని కరోనా గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరిని వదలి పెట్టడం లేదు ఈ వైరస్. అయితే తాజాగా ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ చోటా రాజన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తిహాడ్ జైల్లో చోటా రాజన్ శిక్షను అనుభవిస్తున్నాడు. తాజాగా ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో చోటా రాజన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. చోటా రాజన్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారీ ఎత్తున విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు టెస్టులను పెంచుతున్నారు. గత మూడు రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు రోజుకు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.
previous post
చంద్రబాబు సెక్రటేరియేట్ కు వెళ్తే ఆధారాలు మాయం : జగన్