telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మైత్రి మూవీ మేకర్స్ తో చిరు మూవీ

chiru

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాతో తర్వాత చేయబోయే కొన్ని ప్రాజెక్టుల గురించి మెగాస్టార్ ఇటీవ‌లే హింట్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో కొన్ని కథలను విన్న చిరు ఒకే చెప్పారని సమాచారం. అందులో భాగంగానే లూసిఫర్ రీమేక్ ని యంగ్ డైరెక్టర్ బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా భాగం అయినట్టుగా తెలుస్తోంది. ఇది మలయాళ సినిమాకి రీమేక్.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది.

Related posts