హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ముకుందరావు, తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించవచ్చని చెప్పారు. దక్షిణ కోస్తాంధ్రలో రుతుపవనాలు మరో రెండు మూడు రోజుల్లో ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో రుతుపవనాల రాకతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ముకుందరావు వివరించారు. గత 2 నెలలుగా వేసవి కాలం ఎండలు భరించిన ప్రజలకు రుతుపవనాల రాకతో కురిసే వానజల్లులు కొంత ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చును.