telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వినేవాడుంటే..చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబు బతుకు అంతా.. అన్నీ దొంగ మాటలు, డొల్లతనమేనని పేర్కొన్నారు. ఈ జీవి జీవితమే అంత అని… వినేవాడుంటే- చార్మినార్ కూడా నేనే కట్టా అని చద్రబాబు అంటాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. “ఇదీ హైదరాబాద్ లో జెనోమ్ వ్యాలీ తానే పెట్టాను అంటూ పదే పదే డబ్బా కొట్టే ఫేక్ విజనరీ, మీడియా మేడ్ మాన్ చంద్రబాబు బతుకు – అన్నీ దొంగ మాటలు, డొల్లతనమే. ఈ జీవి జీవితమే అంత. వినేవాడుంటే – చార్మినార్ కూడా నేనే కట్టా అంటాడు చంద్రం. ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని అచ్చెన్న ముందే చెప్పాడు. చికాకులో నోరు జారి ఉంటాడని అనుకున్నారు కొందరు. అది నిజమేనని తెలియడం లేదూ. పరిషత్తు ఎన్నికల బహిష్కరణ, తాజాగా అసెంబ్లీ సెషన్ బాయ్ కాట్ చేస్తున్నట్టు బాబు ప్రకటించడం, సంకేతాలు అవే కదా.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడమే ఒక సాహసం. తాజాగా ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా చేర్చి రోగులకు మనశ్శాంతిని చేకూర్చారు సీఎం జగన్ గారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల పేరిట10 లక్షలు డిపాజిట్ చేయడం కంటే మానవత్వం ఏముంటుంది.” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

Related posts