మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో సిద్ధ అనే పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే షూటింగ్ ముగించుకుని ప్రపంచ వ్యాప్తంగా ‘ఆచార్య’ చిత్రం ఈనెల 29 రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్ను ముమ్మరం చేసింది .
ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి `భలే భలే బంజారా` అనే పాటని విడుదల చేశారు. చీమలు దూరని చిట్టడివికి చిరునవ్వొచ్చింది… నిప్పు కాక రేగింది…” అంటూ పాట మొదలవుతుంది. ఈ పాటలో చిరంజీవి, రామ్చరణ్ ఒకే రకమైన స్టెప్పులతో అదరగొట్టారు.
సాధారణంగానే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ల డ్యాన్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే అది అభిమానులకు పునకాలే. అలాంటి విజువల్ ట్రీట్నే ఇచ్చారు మేకర్స్. చిరు గ్రేస్.. సాంగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి హావభావాలు అదిరిపోయాయి.
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ డాన్సులు కంపోజ్ చేయడం విశేషం.
అమృతే రాసినా, పనిలేని వాడు రాసినా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది : ఆర్జీవీ