కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా పినరయ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. ఈ క్రమంలో ఈ నెల 29 నుంచి శబరిమల ఆలయంలో 10 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలకు భక్తులకు అనుమతించేది లేదని స్పష్ట చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు. అటు గురువాయూర్లోని శ్రీకృష్ణ మందిర్ కూడా మూసివేసినట్లు అక్కడి అధికారులు వెల్డడించారు.అయితే శబరిమల, గురువాయూర్ ఆలయాల్లో కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే నిలిపివేస్తున్నామని.. సంప్రదాయ ప్రకారం జరగాల్సిన అన్ని పూజలు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.