పెళ్ళి గురించి అందాల నటి, అతిలోక సుందరి ముద్దులు కూతురు యూత్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పొచ్చు. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ పెళ్ళిపై ప్రతీ ఒక్కరు ఎన్నో కలలు కంటుంటారు. కానీ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ మాత్రం తన పెళ్లి ఇక్కడే అంటూ క్లారటీ ఇచ్చింది.
ఈ మధ్య సినీ తారలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మనసులో మాట బయటపెట్టింది. తన డ్రీమ్ వెడ్డింగ్ గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి రెండు రోజుల్లో జరిగిపోవాలి, కాప్రి ఐల్యాండ్లో ఓ ప్రైవేట్ బోట్లో నా గ్యాంగ్తో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్నాకా తిరుపతిలో నా పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
పెళ్ళికి డైమండ్తో చేసిన నగలు బాగుంటందని, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్లో ఉన్న అమ్మ ఉన్న ఇంటిలో జరగాలి. పెళ్లికి కాంచీపురం చీర ధరించాలనేది నా కోరిక’’అని చెప్పింది. డెకరేషన్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, అయితే ట్రెడిషనల్గా ఉండాలి, పెళ్లి స్టేజీని మల్లెపువ్వులు, కొవ్వొత్తులతో అలంకరిస్తే బాగుంటుందని.. కాబోయేవాడు తెలివితేటలు ఉన్న వాడైతే చాలని జాన్వీ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’తో పాటు ఓ హిందీ రీమేక్లో నటిస్తోంది.