*కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..
*సూర్యాపేట జిల్లాలో మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..
*మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం
*తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి చికిత్స
సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం చోటుచేసుకుంది. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు తెరాస కౌన్సిలర్ కుమారుడిగా గుర్తించారు…
మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రిపూట ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.