telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం… అందుకే వృషణాలను కోసి పారేశారు…!

Police

మైనర్‌ బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడి వృషణాలను కోసి పారేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని ఐవరీ పార్క్, జొహాన్నెస్ బర్గ్ లో చోటు చేసుకుంది. చీకటి సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు ఇంకెళ్తుండగా… వారిపై హఠాత్తుగా దాడి చేసి, ఆ నిందితుల్లో ఒకరి వృషణాలను కోసి పారేశారు. వాటిని చూపించి మిగతా ఇద్దరినీ బెదిరించడంతో వారిద్దరూ భయపడి అక్కడినుండి పారిపోయారు. తీవ్రమైన రక్తస్రావంతో తల్లడిల్లుతున్న ఆ అత్యాచార నిందుతుడిని దారుణంగా కొట్టి చంపేశారు సదరు వ్యక్తులు. వారు శిక్షించింది నిందితులనే అయినా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమని, అందువల్ల ఈ హత్య చేసిన వారికోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. శనివారం ఈ హత్య జరగగా… అతనికి అత్యాచారం కేసులకు ఉన్న సంబంధంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎవరూ దొరకపోవడం గమనార్హం. గతంలో తన ఇద్దరు మిత్రులతో కలిసి ఓ 15 ఏళ్ల బాలికను, అలాగే మరో 18 ఏళ్ల అమ్మాయిని మృతుడు బలాత్కరించాడు.

Related posts