telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా వీపు పగిలినప్పుడే చంద్రబాబుకు పగలాల్సింది : జేసీ రివర్స్‌ ఎటాక్‌ !

jc-diwakar-reddy

జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఒక్క పేజినే ఇచ్చారని..జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకెళ్లాలని ఫైర్‌ అయ్యారు. దొనకొండ కానీ.. వైజాగ్‌ కానీ రాజధాని చేయాలని చంద్రబాబుకు తాను చెప్పానని.. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఇమేజ్‌తోనే తాడిపత్రిలో ఎక్కువ కౌన్సిలర్లను గెలిచామని.. మా వీపు పగిలినప్పుడే చంద్రబాబుకు పగలాల్సిందని జేసీ అన్నారు. ఎందుకు ఆలస్యమైందని అనేది మా అనుమానమని జేసీ పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఉంటే… కాంగ్రెస్ అధికారంలో ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ నేతలంగా కలిసి పార్టీని చంపేశారని..సీఎం అయిపోదామని పార్టీని నాశనం చేశారని జేసీ దివాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదన్నారు. రాయల తెలంగాణకు జైపాల్‌ రెడ్డి మద్దతు ఇవ్వలేదని… ఆఖరివరకు జైపాల్‌ రెడ్డిని మేం నమ్మామని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా బంగారు తెలంగాణ కాలేదని పేర్కొన్నారు జేసీ దివాకర్‌ రెడ్డి.

Related posts