కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిన్న రాత్రి పది గంటల సమయంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ అధికారులు, ఢిల్లీ పోలీసుల సాయంతో చిదంబరం ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత చిదంబరాన్ని తమతో పాటు తీసుకెళ్లిన పోలీసులు, సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు.
చిదంబరం ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పడంతో సీబీఐ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ హౌస్ లోని 5వ నంబర్ చిన్న గదిలో నిన్న రాత్రంతా ఓ చిన్న గదిలో కాలం వెళ్లబుచ్చారు. ఇంటి నుంచి డిన్నర్ తెప్పించుకోవచ్చని అధికారులు చెప్పినా, అప్పటికే సమయం మించి పోవడంతో తిరస్కరించినట్టు సమాచారం. రాత్రంతా దాదాపు మేలుకునే ఉన్నట్టు తెలుస్తోంది. నేడు ఆయన్ను సీబీఐ కోర్టు ముందు అధికారులు హాజరు పరచనున్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్నారు: చంద్రబాబు