telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చెక్ బౌన్స్ కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు సమన్లు

TDP Candidate withdraw Badwel
పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఓ చెక్ బౌన్స్ కేసులో విశాఖపట్నం కోర్ట్ సమన్లు జారీ చేసింది.  శ్రీనివాసరావు అనే  కాంట్రాక్టర్ వద్ద  2015లో రూ.70 లక్షలు అనిత అప్పు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పోస్ట్ డేటెడ్ చెక్కుతో పాటు ప్రామిసరీ నోటును ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ నగదు అవసరం కావడంతో మరోసారి అనితను కలవగా ఆమె గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను ఇచ్చారని తెలిపారు. దీన్ని బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో డబ్బులు లేవని మేనేజర్ సమాచారం ఇచ్చారన్నారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించినట్లు బాధితుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని అనితకు కోర్టు సమన్లు జారీచేసిందన్నారు.

Related posts