కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల పేరిట గురుకులాను ఏర్పాటు చేసింది. ఇందులో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బీసీ గురుకులాల్లో 1,698 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,071 టీజీటీ, 119 పీఈటీ, 36 ప్రిన్సిపల్ పోస్టులు సహా ఇతర పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఈ పోస్టుల భర్తీ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా జరగనుంది.
previous post
విశాఖ జోన్ ఓ మాయా జోన్: చంద్రబాబు