తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ను ఆ పార్టీ అధినేత అధినేత చంద్రబాబు నాయుడును పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆశోక్బాబు ఇంటికి వెళ్లనున్నారు.
పదోన్నతి కోసం నకిలీ డిగ్రీ డాక్యుమెంట్లు సమర్పించారని అశోక్ బాబుపై ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసారు. అనంతరం నిన్న అర్ధరాత్రి అశోక్ బాబుకు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.
ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పడమట లంకలోని అశోక్బాబు నివాసానికి చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లనున్నారు.
కాగా..ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ సర్కార్ ఉద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని .. ఈ విషయమై చర్చలకు రావాలని ఆశోక్ బాబు సవాల్ విసరడంతో ఆయనపై తప్పుడు కేసు బనాయించారని చంద్రబాబు అన్నారు.
విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ కుట్ర – చినరాజప్ప